మ‌రోసారి కార్పొరేట‌ర్‌గా అవ‌కాశం క‌ల్పించండి: కొమిరిశెట్టి సాయిబాబా

గ‌చ్చిబౌలి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలో చేసిన అభివృద్ధిని చూసి ప్ర‌జ‌లు త‌నను మ‌రోసారి కార్పొరేటర్‌గా గెలిపించాల‌ని డివిజ‌న్ తెరాస అభ్య‌ర్థి కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. డివిజ‌న్ ప‌రిధిలోని ఖాజాగూడ‌లో గురువారం ఆయ‌న ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రితో క‌లిసి ఇంటింటికీ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ డిసెంబ‌ర్ 1న జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో కార్ గుర్తుకు ఓటు వేసి త‌న‌ను గెలిపించాల‌ని కోరారు. డివిజ‌న్‌లో ఇప్ప‌టికే కోట్లాది రూపాయ‌ల వ్య‌యంతో అనేక అభివృద్ధి ప‌నుల‌ను చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు. మ‌ళ్లీ అవ‌కాశం ఇస్తే డివిజ‌న్‌ను ఆద‌ర్శవంతంగా తీర్చిదిద్దుతామ‌న్నారు. ఈ కార్యక్ర‌మంలో తెరాస నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

కారు గుర్తుకు ఓటు వేయాల‌ని కోరుతున్న కొమిరిశెట్టి సాయిబాబా
కారు గుర్తుకు ఓటు వేయాల‌ని కోరుతున్న కొమిరిశెట్టి సాయిబాబా
ఖాజాగూడలో ఎన్నికల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న కొమిరిశెట్టి సాయిబాబా

నేతాజీన‌గ‌ర్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం…
గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని నేతాజీన‌గ‌ర్‌లో డివిజ‌న్ తెరాస కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి కొమిరిశెట్టి సాయిబాబా గురువారం ఇంటింటికీ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ రాష్ట్ర స‌గ‌ర ఉప్ప‌ర సంఘం అధ్య‌క్షుడు ఉప్ప‌రి శేఖ‌ర్ సాగ‌ర్‌, నాయ‌కులు భేరి రామ‌చంద‌ర్ యాద‌వ్‌, రామేశ్వ‌ర‌మ్మ‌, జంగ‌య్య యాద‌వ్‌, రాజు ముదిరాజ్, వెంక‌ట్‌, ర‌మేష్ గౌడ్‌, విజ‌య ల‌క్ష్మి పాల్గొన్నారు.

నేతాజీన‌గ‌ర్ లో కొమిరిశెట్టి సాయిబాబాకు హార‌తి ఇస్తున్న మ‌హిళ‌లు
నేతాజీన‌గ‌ర్‌లో కారు గుర్తుకు ఓటు వేయాల‌ని కోరుతున్న కొమిరిశెట్టి సాయిబాబా, ఉప్ప‌రి శేఖ‌ర్ సాగ‌ర్
నేతాజీన‌గ‌ర్ లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న కొమిరిశెట్టి సాయిబాబా, భేరి రామ‌చంద‌ర్ యాద‌వ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here