కార్పొరేట‌ర్‌గా మ‌ళ్లీ అవ‌కాశం క‌ల్పించండి: పూజిత జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

హ‌ఫీజ్‌పేట‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హ‌ఫీజ్‌పేట డివిజ‌న్‌లో ప్ర‌జ‌ల‌ను ఓట్లు అడిగే హ‌క్కు కేవ‌లం తెరాస‌కే ఉంద‌ని డివిజ‌న్ తెరాస కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి వి.పూజిత జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ అన్నారు. డివిజ‌న్ ప‌రిధిలోని అంబేద్క‌ర్ న‌గ‌ర్ లో సోమ‌వారం ఆమె ఇంటింటికీ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. కారు గుర్తుకు ఓటు వేయాల‌ని కోరారు. ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి కోసం డిసెంబర్ 1వ తేదీన టిఆర్ఎస్ అభ్యర్థిల‌కు ఓటు వేయాల‌ని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల‌న్నారు. కేవ‌లం తెరాస హ‌యాంలోనే డివిజ‌న్ ఎంత‌గానో అభివృద్ధి చెందింద‌న్నారు. ప్ర‌జ‌ల కోసం నిరంత‌రం ప‌నిచేసేది తెరాస ప్ర‌భుత్వ‌మేన‌ని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల స‌హ‌కారంతో డివిజ‌న్‌లో ఎన్నో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టామ‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఎప్పుడు ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా వెంట‌నే ప‌రిష్క‌రిస్తున్నామ‌న్నారు. కార్పొరేట‌ర్‌గా త‌న‌కు మ‌రొక‌సారి అవ‌కాశం క‌ల్పిస్తే డివిజ‌న్‌ను ఆద‌ర్శవంతంగా తీర్చిదిద్దుతాన‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో తెరాస నాయకులు, కార్య‌క‌ర్త‌లు, మ‌హిళ‌లు పాల్గొన్నారు.

ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న పూజిత జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
కారు గుర్తుకు ఓటు వేయాల‌ని కోరుతున్న పూజిత జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here