గంగారం చెరువులో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన కార్పొరేటర్ మంజుల రెడ్టి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారం చెరువులో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను గురువారం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి స్థానిక కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. కొలనులోని చెత్తను తొలగించి శుభ్రమైన నీటిని నింపాలని అధికారులకు సూచించారు. నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు ఓ.వెంకటేష్, దాస్, అధికారులు రమేష్, జగన్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here