పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం: కార్పొరేటర్ మంజులరెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట, గంగారం హనుమాన్ దేవాలయంలో స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక ప్రతిమలకు పూజలు చేసి ఇళ్ల పరిసరాల్లోనే నిమజ్జనం చేసుకోవాలని అన్నారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి పండుగ జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు లక్ష్మినారాయణ గౌడ్, గుర్రపు రవీందర్ రావు, జనార్ధన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, సత్యనారాయణ గౌడ్, ఓ.వేంకటేష్, అక్బర్ ఖాన్, యూసుఫ్, దాస్, కొండల్ రెడ్డి, కార్తిక్ గౌడ్, హరీష్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here