నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలో ఆలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్లలో చేపట్టిన శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ గుడి నిర్మాణం కోసం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి రూ. 50 వేల విరాళాన్ని ఆలయ కమిటీ అధ్యక్షుడు యాదగిరికి అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ దేవస్థానం నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయడం ఆనందంగా ఉందన్నారు. దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, నల్ల పోచమ్మ గుడి అధ్యక్షులు యాదగిరి, సీనియర్ నాయకులు ప్రకాష్, గిరి, వెంకట్, యాదయ్య, ఎల్లేష్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2022/07/IMG-20220714-WA0033.jpg)