సమస్యలపై జడ్సీ కి గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి వినతి

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జోనల్ కమిషనర్ ఆల ప్రియాంకకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జోనల్ కమిషనర్ కార్యాలయంలో జడ్ సీ ప్రియాంకను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కలిసి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోప‌న్‌ప‌ల్లి, గోప‌న్‌ప‌ల్లి తండా ఇందిరానగర్, కేశవనగర్, నేతాజీ నగర్, దర్గా, గౌలిదొడ్డి, నల్లగండ్ల, అపర్ణ సరోవర్ లలో డ్రైనేజీ, నీటి సమస్యలను, రోడ్లు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. గోప‌న్‌ప‌ల్లి తండా లో నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని జోనల్ కమిషనర్ డాక్టర్ ప్రియాంకకు‌ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, గోపనపల్లి తండా వడ్డెర సంఘం ప్రెసిడెంట్ అలకుంట శ్రీరామ్, సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, రంగస్వామి, నరేందర్, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

సమస్యలపై వినతిపత్రం అందజేస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here