వీధి లైట్ల సమస్య లేకుండా చూస్తాం – గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వీధిలైట్లు, విద్యుత్ స్తంబాల సమస్యలు లేకుండా చూస్తామని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. డివిజన్ లో నెలకొన్న సమస్యలపై జీహెచ్ఎంసీ అధికారులతో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ లోని పలు కాలనీల్లో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మాట్లాడారు. విద్యుత్ స్తంభాలు ఎలా ఉన్నాయో పరిశీలించి అవసరం ఉన్న చోట కొత్త స్తంభాలు వేయాలని సూచించారు. వీధిలైట్లు వెలిగేలా చూడాలని, వర్షాకాలంలో క్రిమి కీటకాలు, విష సర్పాలు వీధుల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని, వీధి లైట్లు వెలిగేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. వీధిలైట్ల పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఈఈ ఇంద్రదీప్, డీఈ మల్లికార్జున్ రావు, ఏఈ రాజశేఖర్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, కిషన్ గౌలి, నవోదయ కాలనీ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

అధికారులతో మాట్లాడుతున్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here