శేరిలింగంపల్లి, జూన్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మందాడి మాగ్నస్ అపార్ట్మెంట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన అపార్ట్మెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అభినందించారు. ఈ సందర్భంగా PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ అసోసియేషన్ వాసులు అపార్ట్మెంట్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని అన్నారు. ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని, నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు అపార్ట్మెంట్ వాసులందరికి ఎల్లవేళాలో అందుబాటులో ఉంటూ అపార్ట్మెంట్ సమస్యల పై స్పందిస్తూ , ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి అపార్ట్మెంట్ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మందాడి మ్యాగ్నస్ అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, కమిటీ సభ్యులు సుధాకర్ రెడ్డి, వెంకట్, నాగరాజు, దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.