శేరిలింగంపల్లి, ఏప్రిల్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మంగళవారం సర్కిల్ పరిధిలోని పలువురు వృద్ధులకు డిప్యూటీ కమిషనర్ డి.శశిరేఖ ఆసరా కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ సీవోలు, అధికారులు, సిబ్బంది, వృద్ధులు పాల్గొన్నారు.






