నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనత యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ పిలుపు మేరకు బిజెవైఎం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎన్.పవన్కుమార్ ఆద్వర్యంలో జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్కు విద్యార్థుల తల్లితండ్రుల పక్షాన పలు డిమాండ్లతో వినతీ పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు మారం శ్రీధర్, కుమ్మరి జితేందర్, కార్యదర్శులు జమ్మిశెట్టి సురేష్, పిల్లి సాయి, నాయకులు రాకేష్ యాదవ్ జయ సాయి తదితరులు పాల్గొన్నారు.

- బీజేవైఎం డిమాండ్స్…
కరోనా సమయంలో లాక్డౌన్ కారణంగా తల్లిదండ్రుల ఆర్ధిక ఇబ్బందులు పిల్లలపై పడకుండా చర్యలు తీసుకోవాలి. - పాఠశాల విద్యార్థులకు సరైన దిశ దశ లను చూపుతూ వారిని కాపాడుకోవలసిన బాధ్యత ఈ సమాజం పైన ఉన్నది.
- కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల పేరు మీద విద్యార్థుల తల్లదండ్రులను ఇబ్బంది పెట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
- పాఠశాల ఫీజు కనీసం యాభై శాతం వరకు తగ్గించే లా చర్యలు తీసుకోవాలి.
- అధిక ఫీజులు, ఆన్లైన్ క్లాసుల పేరుతో తల్లిదండ్రులను వేధిస్తున్న పాఠశాలలపై ఒక ప్రత్యేక కమిటీనీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.