మెహిదీపట్నం (నమస్తే శేరిలింగంపల్లి): పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. మెహిదీపట్నం చౌరస్తా వద్ద సీనియర్ జర్నలిస్టు సయ్యద్ హబీబ్ పాషా కాద్రి ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమాలను వెలికి తీసినందుకు విలేకరి సంతోష్ నాయక్పై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బెదిరింపులకు పాల్పడడం దారుణమన్నారు. వెంటనే ఆయనను అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.
