శేరిలింగంపల్లి, అక్టోబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని సుమిత్ర నగర్ లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతీ దేవి అవతారంలో ఉన్న అమ్మవారి పూజలో శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకుడు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు, డివిజన్ అధ్యక్షుడు బాష్పక యాదగిరి, ఏకాంత గౌడ్, కల్పన ఏకాంత్ గౌడ్, మహిళ కాంగ్రెస్ నాయకురాలు దుర్గా రాణి, ఇతర నాయకులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దండే శ్రీనివాస్, వెంకన్న, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.