శేరిలింగంపల్లి, జనవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సందర్బంగా మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన హెచ్ఎంటి కాలనీ, ముజాఫర్ అహ్మద్ నగర్ కాలనీల వాసులు, జిహెచ్ఎంసి శానిటేషన్ అధికారులు ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలందరూ గత సంవత్సరాన్ని స్మరించుకుంటూ నూతన సంవత్సరంలోకి అడిగిడుతూ ఈ నూతన సంవత్సరం ఆశలు, ఆశయాలు, విజయాలు చేకూరి, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాధవరం గోపాల్ రావు, నరేష్ రెడ్డి, ఆనంద్, పండు, నాగేశ్వరరావు, శానిటేషన్ అధికారులు ఎస్ఆర్పి కనకరాజు, మహేష్, SFA లు వినయ్, ఆగమయ్య, సాయి తదితరులు పాల్గొన్నారు.






