మాదాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ల అభివృద్ధిపై విప్ గాంధీని కలిసిన కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి:మాదాపూర్,హఫీజ్ పేట్ డివిజన్లను శేరిలింగంపల్లి ‌నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల కంటే అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుతామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్‌ అన్నారు. మంగళవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని కార్పొరేటర్ జగదీశ్వర్ ‌గౌడ్ కలిసి డివిజన్ లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వినతి పత్రాన్ని అందజేశారు. మాదాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో నూతనంగా చేపట్టాల్సిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మంజూరు చేయాలని, పెండింగులో ఉన్న పనులపై, నూతనంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కార్పొరేటర్ జగదీశ్వర్ ‌గౌడ్ ఎమ్మెల్యే గాంధీ దృష్టి కి తీసుకెళ్లారు.

ప్రభుత్వ విప్ గాంధీకి వినతి పత్రం అందజేస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here