మాదాపూర్ డివిజన్ లో కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర

పాదయాత్రలో సమస్యలు పరిశీలిస్తున్న రవికుమార్ యాదవ్ తదితరులు

మాదాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ మరియు ఆదిత్య నగర్ లలో సోమవారం కాంగ్రెస్ నాయకులు పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి ఇన్చార్జ్ రవి కుమార్ యాదవ్, టీపీసీసీ కార్యదర్శి గంగల రాధా కృష్ణ యాదవ్ లు స్థానిక నాయకులతో కలిసి కాలనీలలో తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లు మరియు డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, సుభాష్ చంద్ర బోస్ నగర్ లో రోడ్లు ఎక్కువ ఎత్తు వేయడం వల్ల ఇంట్లో నుండి వాహనాలను బయటకు తీయలేకపోతున్నామని వాపోయారు. దీంతో పాటు వర్షపు నీరు ఇంట్లోకి వస్తుందని, రోడ్లు ఎత్తు తగ్గులు వేయడం వల్ల డ్రైనేజీ సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ డ్రైనేజీ సమస్యను పరిష్కరించకుండానే హడావిడిగా నాణ్యత లేకుండా రోడ్లు వేయడం జరిగిందన్నారు. పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, ఈద్గా దగ్గర చెత్త చెదారం పేరుకుపోయిందన్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ పరిష్కారం అయ్యేవరకు పోరాడతామన్నారు. ఈ పర్యటనలో స్థానిక నాయకులు హసన్, అమిద్, లతిఫ్, చందు, ఇస్మైల్, అషు, అమద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here