సీఎంఆర్ఎఫ్ తో పేదలకు మేలు – ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది పేదలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న బాధితులకు ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 66 వేల చెక్కులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. మియాపూర్ డివిజన్ మియాపూర్ కి చెందిన వల్లపు శెట్టి కి రూ. 40 వేలు, కూకట్‌పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ కి చెందిన సంపత్ రెడ్డికి రూ. 26 వేలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైనట్లు ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు సుబ్బరాజు, బ్రిక్ శ్రీను, అష్రఫ్, భాస్కర్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here