ట్రక్ డ్రైవర్లకు కరోనాపై అవగాహన

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని బీకే ఎన్ క్లేవ్ వద్ద వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ట్రక్ డ్రైవర్లకు కరోనా మహమ్మారిపై బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. ఆసియన్ పెయింట్స్ సహకారంతో చైల్డ్ సర్వైవల్ ఇండియా ద్వారా ట్రక్ డ్రైవర్లకు రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శశి మనోహర్, సభ్యులు నీరజ్ కుమార్ సింగ్, ఆలీ తదితరులు పాల్గొన్నారు.

ఉచితంగా మందులను అందజేస్తున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here