బిజెపి రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరు సరికాదు: చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బిజెపి పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు చందానగర్ గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ముంబై జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఒక వైపు కేంద్రం ధాన్యం కొనుగోలు చేయమని చెబుతుంటే మరో వైపు బీజేపీ రాష్ట్ర నాయకులు యాసింగిలో వరి వేయండి మేము ప్రభుత్వంతో కొనిస్తామని ప్రచారం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రఘుపతిరెడ్డి, రాఘవరావు, ధనలక్ష్మీ, సుప్రజ ప్రవీణ్, దాసరి గోపి, పులిపాటి నాగరాజు, ఓ వెంకటేష్, గోవర్ధన్ రెడ్డి, పబ్బా మల్లేష్, అక్బర్ ఖాన్, అంజాద్ పాషా, యూసుఫ్, దాస్, కొండల్ రెడ్డి, వరలక్ష్మి, రెడ్డి భవాని, పార్వతి, శ్రీధర్, కార్తిక్ గౌడ్, ఇమ్రాన్, సికిందర్, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్న కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here