హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపీణీ

నమస్తే శేరిలింగంపల్లి: భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ పేర్కొన్నారు. హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందానగర్ హుడాకాలనీలో మట్టి వినాయకులను పంపీణీ చేశారు. ఈ సందర్భంగా కొండా‌ విజయ్ మాట్లాడుతూ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా మట్టి వినాయకుల పంపీణీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం తమ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 వేల వినాయక ప్రతిమలను పంపీణీ చేయనున్నట్లు కొండా విజయ్ కుమార్ పేర్కొన్నారు. మట్టి వినాయకుల ప్రతిమలు కావాల్సిన వారు 9959345643 నంబర్ ను సంప్రదించవచ్చని తెలిపారు.

మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్న హోప్ ఫౌండేషన్ ‌చైర్మన్‌ కొండా‌ విజయ్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here