ముస్లింల అభివృద్ధికి టీఆర్ఎస్ కృషి – చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: ముస్లిం మైనార్టీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి మరవలేనిదని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి అన్నారు. రంజాన్ పండగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేసిన రంజాన్ తోఫా కానుక పంపిణీ కార్యక్రమాన్ని చందానగర్ డివిజన్ పరిధిలోని అహ్మద్ నగర్, భవానిపురం వీకర్ సేక్షన్ కాలనీలలో స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి చేపట్టారు. కాలనీలలోని పేద ముస్లింలకు రంజాన్ బట్టలను అందజేశారు. ఈ సందర్భంగా మంజులరఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు అండగా ఉంటుందని వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. పేద, ధనిక తారతమ్యాలు లేకుండా అందరూ పండుగలను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, గురు చరణ్ దూబే, అక్బర్ ఖాన్, అమ్జద్ పాషా, వరలక్ష్మి రెడ్డి, సికేందర్, సందీప్ రెడ్డి, అవినాష్ రెడ్డి, అఫ్సర్, అల్తాఫ్, అమిత్ దుబే, మహబూబ్, విజయ్, రషీద్ తదితరులు పాల్గొన్నారు.

ముస్లింలకు రంజాన్ బట్టలను అందజేస్తున్న కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here