చందాన‌గ‌ర్ స‌ర్కిల్ ఉప వైద్యాధికారిగా డా.బి.కార్తిక్‌… శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్‌కు బ‌దీలీపై వెళ్లిన‌ డాక్ట‌ర్ ర‌వి…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: జీహెచ్ఎంసీ చందాన‌గ‌ర్ స‌ర్కిల్ 21 ఉప వైద్యాధికారి(ఏఎంఓహెచ్‌)గా డాక్ట‌ర్ బి.కార్తిక్‌ భాద్య‌త‌లు స్వీక‌రించారు. నిర్మ‌ల్ జిల్లా సారంగ‌పూర్ ప్రాధ‌మిక ఆరోగ్య కేంద్రంలో సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌గా విధలు నిర్వ‌హిస్తున్న డాక్ట‌ర్ బి.కార్తిక్ డిప్యూటేష‌న్‌పై జీహెచ్ఎంసీలో విధులు నిర్వ‌హించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు ఈనెల 8న గ్రేట‌ర్ క‌మిష‌న‌ర్‌కు అర్జీ చేసుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న అర్జీకి స్పందించిన గ్రేట‌ర్ క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ బి.కార్తిక్‌ను చందాన‌గ‌ర్ స‌ర్కిల్ 21 ఏఎంఓహెచ్‌గా నియ‌మిస్తూ సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ నేప‌థ్యంలో డాక్ట‌ర్ బి.కార్తిక్ మంగ‌ళ‌వారం చందాన‌గ‌ర్ స‌ర్కిల్ కార్యాల‌యంలో భాద్య‌త‌లు స్వీక‌రించారు. క‌రోనా రెండ‌వ ద‌శ విస్త‌ర‌ణ నేప‌థ్యంలో సిబ్బంది స‌హ‌కారంతో స‌ర్కిల్ ప‌రిధిలో ప్ర‌జారోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి సారిస్తాన‌ని అన్నారు.

డా.బి.కార్తిక్‌

శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్ ఉప వైద్యాధికారిగా డాక్ట‌ర్ ఎస్‌.ర‌వి…
చందాన‌గ‌ర్ స‌ర్కిల్ 21 ఏఎంఓహెచ్‌గా విధులు నిర్వ‌హిస్తున్న డాక్ట‌ర్ ఎస్‌.ర‌వి శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్ 20కి బ‌దిలీ పై వెళ్లారు. అక్క‌డ ఇంచార్జీ ఏఎంఓహెచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న స‌ర్కిల్‌ వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ రంజిత్ నుంచి డాక్ట‌ర్ ఎస్.ర‌వి మంగ‌ళ‌వారం భాద్య‌త‌లు స్వీక‌రించారు. క‌రోనా ఉదృతి కొన‌సాగుతున్న నేప‌థ్యంలో శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్‌లో ఇంచార్జీ నుంచి పూర్తి స్థాయి ఉప‌వైధ్యాధికారి అందుబాటులోకి రావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here