సీసీ రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి దశల వారీగా అభివృద్ధి చేస్తామని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ చెప్పారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను కాలనీ వాసులు, జీహెచ్ఎంసీ అధికారులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు దేవేందర్ రావు, జే,సి మధుసుధన్ రెడ్డి, వర్క్ ఇన్‌స్పెక్టర్ జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో‌ సీసీ రోడ్డు పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here