దీప్తీశ్రీన‌గ‌ర్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ముంపు స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి: కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్ రెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చందానగర్ డివిజన్ ప‌రిధిలోని దీప్తిశ్రీ నగర్ సిబిఅర్ ఎస్టేట్ వ‌ద్ద చేప‌డుతున్న ఆర్‌సీసీ బాక్స్ డ్రైన్‌ నాల పనులను చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి శ‌నివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షా కాలంలో సిబిఅర్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ వరద ముంపుకు గురి కాకుండా ఈ నాల పనులు చేపట్టడం జరిగిందన్నారు. వర్షా కాలంలో దిప్తిశ్రీనగర్ ప‌రిస‌ర ప్రాంతాల వాసులు తివ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలకు శాశ్వ‌త‌ పరిష్కారం చూప‌డానికి ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ ఎంతో కృషి చేస్తున్నార‌ని అన్నారు. ఇప్ప‌టికే నాలాల పూడిక‌తీత పూర్త‌య్యింద‌ని అన్నారు. నిర్మాణంలో ఉన్న నాలాల విస్త‌ర‌ణ ప‌నుల‌ను త్వ‌రిత గ‌తిన పూర్తి చేసేలా అధికారుల‌పై ఒత్తిడి తెస్తున్న‌ట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయ‌కులు, కాల‌నీ వాసులు పాల్గొన్నారు.

సీబీఆర్ ఎస్టెట్స్ వెన‌కాల కొన‌సాగుతున్న నాలా విస్త‌ర‌ణ ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్‌రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here