ఇంటింటి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను పరిశీలించిన కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత కరోనా స్పెషల్ వాక్సినేషన్ డ్రైవ్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక కార్పొరేటర్ వి.పూజితజగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. జనప్రియ అపార్ట్ మెంట్స్ లో, హఫీజ్ పేట్ వార్డు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ ను శనివారం పరిశీలించారు. ఇంటింటికి చేపట్టిన ఉచిత వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా పలు కాలనీ, బస్తీలో వంద శాతం వాక్సినేషన్ పూర్తిచేసినందుకు అధికారులను, సిబ్బందిని అభినందించారు. అనంతరం చందనగర్ హెల్త్ ఆఫీసర్ కార్తీక్, నోడల్ అధికారి డీఈ సురేష్, ఎస్ఆర్పీ మహేష్, స్థానిక నాయకులతో కలిసి కోవిడ్ సర్టిఫికేట్ అందించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కనకమమిడి వెంకటేష్ గౌడ్, సంతయ్య, ప్రవీణ్ గౌడ్, శ్రీనివాస్, ఉమామహేశ్వర, జితేందర్ రెడ్డి, భూషణం, అశోక్, రవి, నరేష్, కోటేశ్వర, శ్రావణ, మహిళలు పద్మ, శాంతి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ‌ను అందజేస్తున్న కార్పొరేటర్ పూజితా గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here