శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించినందుకు గాను ఆ పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డిని ఆ పార్టీ శేరిలింగంపల్లి నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి బీజేపీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కలివేముల మనోహర్, మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు మాణిక్, ప్రధాన కార్యదర్శలు లక్ష్మణ్, రామకృష్ణ, రత్నం, సిద్దు పాల్గొన్నారు.
