నమస్తే శేరిలింగంపల్లి: హుజురాబాద్ లో ఈటల రాజేందర్ విజయం పట్ల గచ్చిబౌలి డివిజన్ బిజెపి ప్రెసిడెంట్ కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో రాయదుర్గం, మధురానగర్ దాబా వద్ద బిజెపి శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. బిజెపి అఖండ మెజార్టీ సాధించడం పట్ల బిజెపి నాయకుల ఆనందోత్సవాలకు అవధుల్లేవు. రాబోయే రోజుల్లో బిజెపి మరింత సత్తా చాటనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు అనిల్ గౌడ్, నరేందర్ గౌడ్, ఎన్. సురేష్ ముదిరాజ్, నరేందర్ ముదిరాజ్, డివిజన్ నాయకులు శ్రీనివాస్ చారి, మహేందర్ గౌడ్, సురేందర్, సతీష్ గౌడ్, నందు, దయాకర్, ఆర్. వెంకటేష్, మహేశ్వరి, పూజ నక్క శివకుమార్, సామ్రాట్ గౌడ్, ప్రవీణ్ యాదవ్ నరేందర్ యాదవ్, శ్యామ్ యాదవ్, అమర్ యాదవ్ గోపాల్, రాజు,సతీష్ గౌడ్, రవి లు పాల్గొన్నారు.