గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): పాతబస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే రాజాసింగ్, కొత్తగా ఎన్నికైన 48 మంది కార్పొరేటర్లు శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రజలకు సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు.

