హఫీజ్ పేట్(నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రంలోని క్రైస్తవుల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం పాటు పడుతోందని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. శుక్రవారం హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఇంజనీర్స్ ఎనక్లేవ్ లో గల ఫీలడెల్పియాహోలీ చర్చ్ లో క్రిస్టమస్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న నూతన వస్త్రాలను స్థానిక కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్ తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా అరెకపూడి గాంధీ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మతాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జి.జె.స్వర్ణాలత, ఆర్.డి.వి.ప్రసాద్, కే.శ్యామ్ బాబు, పి.కమలాకర్, టి.ఎస్.జె.దేవనంద్ వార్డ్ సభ్యులు శేఖర్ ముదిరాజ్, వెంకటేష్ గౌడ్, మాజి కౌన్సిలర్ కిష్టయ్య, డివిజన్ ఉపాధ్యక్షులు వాలా హరీష్ రావు, ఆంజనేయులు రాజు, శివరామకృష్ణ, జైపాల్ రెడ్డి, దాస్, రామకృష్ గౌడ్, సుదర్శన్, సాంగరెడ్డి, సుధాకర్, చంద్రశేఖర్, మౌలానా, మోసిన, ఇస్మాయిల్, రంజాన్, ప్రవీణ్, నాగరాజ్, శోభన్, హనీఫ్, నరేందర్, పద్మరావు, లక్ష్మణ్, సురేష్, రోహిత్, సంపత్, రాజరాజ్, శ్రీనివాస్, యాదగిరి, సాయి, దిలీప్, శ్రీకాంత్, రాజు, వీరేంధర్, గోపాల్, అశోక్, వెంకట్ రెడ్డి, శేఖర్, రాముయాదవ్ తదితరులు పాల్గొన్నారు.