మేయర్ తీరు పట్ల బిజెపి కార్పొరేటర్ల మండిపాటు – కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయండి: గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బిజెపి కార్పొరేటర్లు ధర్నా చేశారు. బిజెపి ప్రజా ప్రతినిధులకు అపాయింట్ మెంట్ ఇచ్చిన మేయర్ కలవకుండా అవమానించారని నగర బిజెపి కార్పోరేటర్లు ఆరోపించారు. సమస్యలపై వినతి పత్రం‌ ఇచ్చేందుకు వస్తే ఆరోగ్య కారణాలు చెప్పి తప్పించుకోవడం మేయర్ కు తగదన్నారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి ఎనిమిది నెలలు కావస్తున్నా ఒక్క సారి కూడా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. డివిజన్లలో నిధులు లేక అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామన్నారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రజల నుండి రోజు ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోతున్నామని తెలిపారు. నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే ఆపేస్తున్నారని గంగాధర్ రెడ్డి వాపోయారు. కాంట్రాక్టర్లను ప్రశ్నిస్తే నిధులు విడుదల కాక అప్పులపాలై ఇద్దరు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కార్పొరేటర్లను, ఎమ్మెల్యేలను, అధికారులు గుర్తించే పరిస్థితి లేదన్నారు. మరుగుదొడ్లు, మురికి కాలువలు, వీధిలైట్లు చూసుకునే వర్కర్లుగా కార్పొరేటర్‌ల పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమను గెలిపించారనీ, వారి నమ్మకాన్ని నిలబెట్టడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. వారం రోజుల్లో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయకపోతే నిరంతరంగా జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని బిజెపి కార్పొరేటర్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు సునీత ప్రకాష్ గౌడ్, సుప్రియ గౌడ్, రవి చారీ, వినయ్ కుమార్, రాంచన శ్రీ, సరళ, సుచరిత, దీపికా, అరుణ, భాగ్యలక్ష్మి బొక్క, అలె భాగ్య లక్ష్మి, జంగం శ్వేతా, వెంకటేష్, లక్ష్మి గౌడ్, ఉమా రాణి, అమృత, వెంకట్ రెడ్డి, శంకర్ యాదవ్, లాల్ సింగ్, శశికళ, బోణీ దర్శన్, కరుణాకర్, సునీత, రాజ్య లక్ష్మి, చంద్ర రెడ్డి, మహేందర్, హరీష్, శ్రీవాణి బండారు, రాధా ధీరజ్ రెడ్డి, ఆకుల శ్రీవాణి, సంగీత, తోకల శ్రీనివాస్ రెడ్డి, అర్చన, రంగ నర్సింహా గుప్త, వంగ మధుసూదన్ రెడ్డి, ప్రేమ్ మహేష్ రెడ్డి, సుజాత, కళ్లెం నవజీవం రెడ్డి, పవన్ కుమార్ ముదిరాజ్, కొప్పుల నర్సింహా రెడ్డి, చింతల అరుణ యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న బిజెపి కార్పొరేటర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here