నమస్తే శేరిలింగంపల్లి: భేరి ఫిలింకార్పొరేషన్ యూట్యూబ్ ఛానల్ లో షార్ట్ ఫిలిమ్స్ ఎంటర్టైన్మెంట్స్ ఫోక్ సాంగ్స్ తో పాటు భవిష్యత్తులో పెద్ద సినిమాలు చేసే సంస్థగా ఎదగాలని షార్ట్ ఫిల్మ్స్ డైరెక్టర్ డాక్టర్ కుమార స్వామి ఆకాంక్షించారు. భేరి రాంచందర్ యాదవ్ నిర్మాణ సారథ్యంలో రూపొందిన మా ఊరిలో లఘు చిత్రం ట్రైలర్ ను ఆదివారం విడుదల చేశారు. నిర్మాత భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ మాతృభాష పరిరక్షణ కోసం చేసిన లఘు చిత్రం మా ఊరిలో గ్రామీణ నేపథ్యంలో సాగుతూ తెలుగు భాష గొప్పదనం గురించి వివరించే చిత్రమని అన్నారు. భేరి ఫిలిం కార్పొరేషన్ యూట్యూబ్ ఛానల్ లో ట్రైలర్ విడుదల సందర్భంగా ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు వీక్షించి లైక్, షేర్, సబ్ స్క్రైబ్ చేసి ఆదరించాలని కోరారు. హిందీ లెక్చరర్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష మన జీవితమని దీనిపై లఘు చిత్రం తీయడం సంతోషకరమని అన్నారు. సాయి భక్తి బృందం సతీష్ మాట్లాడుతూ ట్రైలర్ చాలా మంచిగా వచ్చిందని, ఈ చిత్రంలో పని చేసిన టెక్నీషియన్స్, నటీనటులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్ కాలనీ ఉపాధ్యక్షుడు రాముడు, యువజన విభాగం నాయకుడు కే రాము యాదవ్, శ్రీకాంత్ యాదవ్, నటులు రంజిత్ కుమార్, కడుమూర్ శ్రీనివాస్, శ్రీశైలం యాదవ్, విజయ్ కుమార్, నాగర్గూడ రామచంద్రయ్య, తలారి పవన్, శివ, దర్శకుడు మధు తదితరులు పాల్గొన్నారు.