శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని తారానగర్ లో
బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్ నాయకుడు మారం వెంకట్ అధ్యక్షతన సీనియర్ నాయకుడు బొమ్మ కృష్ణ మూర్తి సంతాప సభ నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ గజ్జల యోగానంద్, బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి, కృష్ణా రెడ్డి, భీమ్ రావు, నాగేశ్వర్ గౌడ్, భాస్కర్ రెడ్డి, జ్ఞానేంద్ర ప్రసాద్, రవికుమార్ యాదవ్, ఎల్లేష్, వీరేశం గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, లక్ష్మా రెడ్డి, రామచందర్, మల్లికార్జున్ శర్మ, శేఖర్ సాగర్, శివ రాజయ్య, బాచు రాజు, రామా చారి, రామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శాంతి భూషణ్ రెడ్డి, జితేందర్, శ్రీనివాస్, శ్రవణ్, మనోజ్ పాల్గొన్నారు.

