శేరిలింగంపల్లి, ఆగస్టు 24 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ సర్కిల్ 48 పరిధిలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 4 ఫిర్యాదులను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. విభాగాల వారీగా పరిశీలిస్తే.. టౌన్ ప్లానింగ్ విభాగానికి 1, ఇంజినీరింగ్ విభాగానికి 1, యూబీడీ విభాగానికి 1, ఎలక్ట్రికల్ విభాగానికి 1 ఫిర్యాదు అందింది. రెవెన్యూ, హెల్త్ అండ్ శానిటేషన్, యూసీడీ, ఇరిగేషన్, వెటర్నరీ విభాగాలతో పాటు ఇతర విభాగాలకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత విభాగాలు పరిశీలించి పరిష్కరించనున్నాయి.






