శిల్పారామంలో అలరించిన కూచిపూడి నాట్య ప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో డిస్ట్రిక్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్ పో సందర్భంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నాట్య వేదం కూచిపూడి డాన్స్ ఇన్ స్టిట్యూట్ నిర్వాహకులు గుంటుపల్లి వేదవతి శిష్య బృందం కూచిపూడి నాట్య ప్రదర్శన ఇచ్చారు. పూజ నృత్యం, శ్రీ గణపతిమ్, రామాయణ శబ్దం, బాలగోపాలా తరంగం, దశావతారం, సంచారధార – అష్టపడి, కామాక్షి స్తుతి, శ్రీనగర లహరి తదితర అంశాలపై కళాకారులు ప్రదర్శించారు. లాస్య లాలస, చేతనా, స్మృతి, ప్రతీక్ష, దియా, స్నికిత, శ్రేయ, మంజి, ఈశు తదితర కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలతో అందరిని ఆకట్టుకున్నారు.

శిల్పారామంలో కళాకారుల కూచిపూడి నృత్యప్రదర్శన
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here