చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయం – గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డిలో అంబేడ్కర్ గౌలిదొడ్డి డెవలప్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బిజెవైఎం కోశాధికారి రఘునాథ్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో దోహదపడుతాయని అన్నారు. చలివేంద్రం ఏర్పాటుకు ముందుకు వచ్చిన అనిల్ గౌడ్ ను కార్పొరేటర్ అభినందించారు. సామాజిక సేవల్లో యువత ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గోపనపల్లి తండా వడ్డెర సంఘం అధ్యక్షుడు అలకుంట శ్రీరామ్, సీనియర్ నాయకులు కృష్ణ, ప్రసాద్, నరసింహ, బాలకృష్ణ, ప్రశాంత్, నగేష్, బాబు, చెన్నయ్య, మన్నే రమేష్, రంగస్వామి ముదిరాజ్, ప్రకాష్, ప్రశాంత్, క్రాంతి, సాయి,‌ వెంకటేష్, టింకు, జీవన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here