ఎన్టీఆర్ నగర్ లో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బస్తీబాట

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు స్థానిక కార్పొరేటర్ బస్తీ బాట నిర్వహించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచి నీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాల సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చే దిశగా పని చేస్తున్నామని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ లోని ప్రతీ కాలనీ, బస్తీల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతీ మాటను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా అభివృద్ధి పనులు చేపడుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ అధ్యక్షులు బి. విఠల్, కోశాధికారి వేణు గోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ నగర్ సొసైటీ కార్యదర్శి నరసింహ రెడ్డి, కార్యదర్శి నాగ సుబ్రహ్మణ్యం, సీనియర్ నాయకులు నగేష్ కుంచాల, బాలు నాయక్, నాగరాజు ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులు సుశీల లక్ష్మణ్, కృష్ణ, బాలు, శ్రీను, సుగుణ, జ్యోతి, రంజిత్, మల్లీశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ నగర్ లో బస్తీబాట నిర్వహించి సమస్యలు తెలుసుకుంటున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here