గోపన్ పల్లిలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తాం – గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనకు శాయశక్తులా కృషి చేస్తామని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి లో నూతనంగా నిర్మిస్తున్న భుగర్భ డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణం పనులను కాలనీ వాసులతో కలిసి స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలో ప్రతి కాలనీ,బస్తీలో ప్రజలకు మెరుగైన మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుస్తామని చెప్పారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిర్ణీత సమయంలో డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మన్నే రమేష్, బాలరాజు, నర్సింగ్ రావు గోపన్ పల్లి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

గోపన్ పల్లిలో యూజీడీ పనులను పరిశీలిస్తున్న గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here