మున్సిపల్ ఉద్యోగ, కార్మిక సంఘం డైరీని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగ, కార్మిక సంఘం 2022వ సంవత్సరం నూతన డైరీని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య విభాగంలో ఉన్న పలు సమస్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లినట్లు అధ్యక్షుడు తిప్పర్తి యాదయ్య తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జగన్ మోహన్, మంద రవి, కృష్ణ, దేవానందం, జలందర్ రెడ్డి, అశోక్ కుమార్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ తిప్పర్తి మహేష్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చిరు నీలం, శ్రీనివాస్ రెడ్డి, కార్యనిర్వహక అధ్యక్షుడు నాగేషప్ప, సాయి కుమార్, అష్రాఫ్, బిక్షపతి, అచ్యుత్, నారాయణస్వామి, యాదయ్య , అజారుద్దీన్,‌ లక్మి పవన్, లవ, రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

నూతన డైరీని ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here