సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తాం- హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్ లో నూతనంగా చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్, స్థానిక నాయకులతో కలిసి కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాఫీజ్ పెట్ డివిజన్ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు, నాయకులు యాదగిరి ముదిరాజ్, సుబ్బు, ఉమామహేశ్వరరావు, విష్ణు, విజయ్ కుమార్, నాగేశ్వర్ రావు, రవి చందర్, మోహన్, వీరాజు, శ్రీనివాస్ గౌడ్, వెంకట్ రెడ్డి, సాయి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

యూజీడీ పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here