నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేసి వాటి పరిష్కారానికి దశల వారీగా కృషి చేస్తామని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీ, తాజ్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బస్తీ బాట చేపట్టారు. కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ లో డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు, తదితర మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీల సొసైటీ అధ్యక్షులు బి. విటల్, ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగ సుబ్రహ్మణ్యం, సీనియర్ నాయకులు వేణు గోపాల్ రెడ్డి, నరసింహా రెడ్డి, విజయ్ ప్రకాష్, నవాజ్, రామచందర్, రమణ, ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీ, తాజ్ నగర్ కాలనీ వాసులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2022/02/IMG-20220218-WA0012.jpg)