లక్ష్మీ విహార్ ఫేజ్ 1 లో దుర్గామాత విగ్రహం లభ్యం – పాలాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్న మహిళలు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నల్లగండ్ల లక్ష్మీ విహార్ ఫేజ్ 1 కాలనీలో దుర్గామాత విగ్రహం వెలుగులోకి‌ వచ్చింది. ఫేజ్ 1 కాలనీ సొసైటీ ఆయుధాల ప్రాంగణంలో సింహాసనంపై కూర్చుని ఆయుధాలు ధరించిన రూపంలో దుర్గామాత విగ్రహం లభించింది. ఈ విషయా‌న్ని తెలుసుకున్న కాలనీ వాసులు, మహిళలతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి దుర్గామాత విగ్రహానికి పాలాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న చందానగర్ ఎస్ ఐ అహ్మద్ పాషా, పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు‌ జరగకుండా శాంతిభద్రతలను పర్యవేక్షించారు.

లక్ష్మీ విహార్ ఫేజ్ 1 లో దుర్గామాత విగ్రహానికి పూజలు చేస్తున్న మహిళలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here