నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై టీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, ఆయా కాలనీ వాసులు శనివారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, డివిజన్ పరిధిలోని కాలనీలలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. కాలనీల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. అందరికి ఎల్లవేళలో అందుబాటులో ఉంటూ కాలనీల సమస్యల పై స్పందిస్తూ, ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి డివిజన్ అభివృద్ధి కి పాటుపడాలని సూచించారు. శేరిలింగంపల్లి డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దే క్రమం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. డివిజన్ లో నెలకొన్న డ్రైనేజీ, రోడ్లు , వీధి దీపాల వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ విప్ గాంధీకి వినతి పత్రం అందజేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ గాంధీ త్వరలోనే డ్రైనేజీ ,రోడ్లు వంటి మౌలిక వసతులు కలిపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, రవి యాదవ్ , ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షులు రమేష్ , కృష్ణ యాదవ్, వార్డ్ మెంబర్ పొడుగు రాంబాబు, వేణు , రమణయ్య, చైతన్య, నటరాజ్, పవన్ కుమార్,
కొడిచెర్ల మహేష్, సురేష్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, మహేష్ యాదవ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
