నమస్తే శేరిలింగంపల్లి: వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని వేంకటేశ్వరనగర్ 35వ బ్లాక్లోగల కట్టమైసమ్మ ఆలయ 14వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు ఎర్ర లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ బిజెపి నాయకులు ఉప్పల ఏకాంత్గౌడ్ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భీమ్ రాజ్, వివేకానంద డివిజన్ బిజెపి నాయకులు గణేష్ గౌడ్ మారల శ్రీను, సంతోష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2021/06/WhatsApp-Image-2021-06-25-at-6.19.14-PM.jpeg)