నమస్తే శేరిలింగంపల్లి: ప్రజాసేవ పట్ల అంకిత భావం, పార్టీ పట్ల అమిత ప్రేమ భావం కారణంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి మరోమారు ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన సందర్భంగా నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ అధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్ ఎమ్మెల్యే గాంధీ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే గాంధీకి మూడోసారి అవకాశం ఇచ్చిన సందర్భంగా అసోసియేషన్ సభ్యులు రవి నాయక్, దశరథ నాయక్ తిరుపతయ్య, సాగర్ మల్లికార్జున్ మేస్త్రి, ఏడుకొండలు మేస్త్రి, కమల్ సింగ్, గణేష్ నాయక్, శంకర్ నాయక్, లక్ష్మణ్ మేస్త్రి, ఎండి మౌలానా, శ్రీనివాస్ యాదవ్, మోహన్ చారి, శంకర్ నాయక్, రితిక్ సింగ్, వెంకట్ రెడ్డి, చంద్రశేఖర్ యాదవ్ మరియు కాలనీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.