గణనాథుడికి విశేష పూజలు

నమస్తే శేరిలింగపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్, శంకర్ నగర్, అన్నపూర్ణ ఎన్ క్లేవ్ కాలనీలలో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని గణనాథుడు విశేష పూజలందుకుంటున్నాడు. ఈ సందర్భంగా పలు వినాయక మండపాల వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

అనంతరం పూజలు చేసి అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రవీందర్ రావు, లక్ష్మీనారాయణ గౌడ్, వీరేశం గౌడ్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, పాత్రికేయ మిత్రుడు వినయ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు యాదగిరి గౌడ్, ఉరిటీ వెంకట్ రావు,జనార్దన్ రెడ్డి, ప్రవీణ్, రాంచందర్, ప్రసాద్, నాగరాజు, ఓ. వెంకటేష్, రవీందర్ రెడ్డి, సందీప్ రెడ్డి, నరేందర్ బల్లా, యశ్వంత్ కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు, అపార్ట్ మెంట్ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here