గురువులను ఎన్నటికీ మరిచిపోకూడదు – గచ్చిబౌలి ‌కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధి ఖాజాగూడలోని సాయి వైభవ్ కాలనీ సాయిబాబా ఆలయంలో నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకల్లో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ సాయినాథుని కృపతో ప్రజలందరూ చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. జీవితంలో మనకు జ్ఞాన సముపార్జన‌కు కారణమైన గురువులను ఎన్నటికీ మరిచిపోకూడదని అన్నారు. గురుశిష్యుల బంధం విడదీయరానిదని తెలిపారు. సద్గురు సాయినాథుడు తన భక్తులకు ఎన్నో సందేశాలతో జ్ఞానాన్ని అందించారన్నారు. ఈ కార్యక్రమం లో సాయిబాబా ఆలయ చైర్మన్ నర్సింహా మూర్తి, సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు రాం రెడ్డి, అశోక్ రాజు, రమణి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, ప్రకాష్, అనిల్ గౌడ్, బిక్షపతి, చిన్న తదితరులు పాల్గొన్నారు.

ఖాజాగూడలోని సాయి వైభవ్ కాలనీ సాయినాథుని ఆలయంలో పూజలు చేస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here