గురు మార్గానికి శ్రీకారం చుట్టిన మహోన్నతుడు వ్యాస మహర్షి

నమస్తే శేరిలింగంపల్లి: గురుపరంపరలో ఆది గురువు వ్యాస మహర్షి అని, గురు మార్గానికి శ్రీకారం చుట్టిన వ్యాస మహర్షి జయంతి సందర్భంగా గురు పౌర్ణమి జరుపుకోవడం జరుగుతుందని హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ అన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎం.ఐ.జి కాలనీ, హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ, జనప్రియ ఫేస్1, లింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్, కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి కాలనీ లో గల సాయి బాబా ఆలయాలలో కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. సద్గురువు సాయినాథున్ని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. గురువు విశిష్టత ఎంతో ప్రాధాన్యమైందన్నారు.

గురుపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్ దంపతులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here