సెంట్రల్ పార్కు ఫేజ్ -2 లో వెంకటేశ్వర ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన – పాల్గొన్న ప్రజా ప్రతినిధులు

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేవాలయాలు వైభవాన్ని సంతరించుకుంటున్నాయని ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి పేర్కొన్నారు. శేరిలింగంపల్లి పరిధిలోని సెంట్రల్ పార్క్ కాలని ఫేజ్ -2 వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి ప్రభుత్వ విప్, శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్యాత్మికత పట్ల మక్కువ చూపే మంచి మనిషి అన్నారు. దేవాలయాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. సెంట్రల్ పార్కు ఫేజ్ -2 లో నూతనంగా వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మాణం చేపట్టడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కాలనీ పార్క్ ప్రెసిడెంట్ రమణి, కాలనీ సెక్రటరీ రాధాకృష్ణ, హరినారాయణ, రామకృష్ణ, గోపాల్ యాదవ్, పటోళ్ల నర్సింహా రెడ్డి, సెంట్రల్ ఫేజ్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

వెంకటేశ్వర ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్సీ సురభివాణీ దేవి, ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ 
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here