ఇంటి నుంచి స్కూటీపై వెళ్లిన విద్యార్థి అదృశ్యం

నమస్తే శేరిలింగంపల్లి: ఇంటి నుంచి స్కూటీపై బయటకు వెళ్లిన విద్యార్థి అదృశ్యమైన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా నూటలపాడుకు చెందిన బరివేరి రమణయ్య కోటేశ్వరీ దంపతులు కుటుంబ సభ్యులతో ఖానామేట్ వీకర్ సెక్షన్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కుమారుడు రాజు ఇంట్లో నుంచి ఇప్పుడే వస్తానంటూ స్కూటీపై బయల్దేరి తిరిగి ఇంటికి రాలేదు‌. దీంతో చుట్టుపక్కలా, బంధువుల ఇళ్లలో ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి కోటేశ్వరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.

అదృశ్యమైన విద్యార్థి రాజు

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here