దశల వారీగా సమస్యల పరిష్కారం: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

బాపూనగర్ లో స్థానికులతో మాట్లాడుతున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): బాపునగర్ లో నెలకొన్న సమస్యలన్నింటిని దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం బాపునగర్ లో పాదయాత్ర నిర్వహించిన రాగం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సరఫరాపై ఆరా తీయగా నీటి సరఫరాలో సమస్యలు లేవని, యూజీడీ లైన్లు చిన్నగా ఉండడంతో తరచుగా సమస్య తలెత్తుతుందని కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ స్తంభాలు ఇళ్లకు అడ్డంగా ఉండడంతో ఎర్తింగ్ వస్తుందని స్తంబాలను మార్పించాలని స్థానికులు కోరారు. ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని నాగేందర్ యాదవ్ తెలిపారు. ఈ పర్యటనలో సుధాకర్ రెడ్డి, రవి, సత్యనారాయణ, బసవరాజు, నారాయణ వేణు, సురేష్ తదితరులు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here