నమస్తే శేరిలింగంపల్లి: రంగారెడ్డి(అర్బన్) జిల్లా ఓబీసీ మోర్చ నూతన కార్యవర్గాన్ని మోర్చ జిల్లా అధ్యక్షులు రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్ ఆదివారం ప్రకటించారు. మోర్చ ఉపాధ్యక్షులుగా మక్తాల స్వామిగౌడ్, జి.సంతోష్, నీలమ్ నరేందర్ కుమార్, బొంగు రఘుగౌడ్, ఎస్.వాసులు, ప్రధానకార్యదర్శులుగా ఎస్.శ్రీశైలం యాదవ్, వి.దశరథ్ సాగర్, ఎస్.వెంకటేష్ కురుమ, కార్యదర్శులుగా జి.జంగయ్య యాదవ్, చిన్నం సతీష్, తిరుపతి ముదిరాజ్, హరి కిషన్ జీ, డి.భరత్ రాజ్లు, స్పోక్స్ పర్సన్గా ఎన్.జగన్, కార్యవర్గ సభ్యులుగా అశోక్, వినోద్ కుమార్, సుమిత్ సింగ్, నాంపల్లి శంకరయ్య, బి.రమేష్, టి.రాజేష్, సిహెచ్.సంతోష్, చందుయాదవ్, ఎన్.రమేష్, సిద్దేశ్వర్, చంద్రశేఖర్యాదవ్, నీరుడి సురేష్, రాఘవేందర్గౌడ్, నందుగౌడ్, యాదగిరియాదవ్, కె.శ్రీనివాస్, యోగి, ఓంకార్, వెంకటేష్ చారి, వెంకటరంగారావు, పాండు యాదవ్లను ఏకగ్రీవంగా నియమించారు. ఈ సందర్బంగా అధ్యక్షుడు నాగేశ్వర్గౌడ్ మాట్లాడుతూ తమపై నమ్మకముంచి బాధ్యతలను అందించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా తమకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్దితో నెరవేర్చి పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.